ఇస్లామాబాద్:పాకిస్థాన్ గురువారంఎడారి ప్రాంతంలో అణు క్షిపణి ‘ఘజ్నవీ’ని పరీక్షించింది. ప్రయోగం విజయవంతమైనట్లు తెలిసింది. ఘజ్నవీ అణ్వస్త్ర వార్ హెడ్లను మోసుకెళ్లగలదు. ఉపరితలం నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే వీలున్న ఈ బాలిస్టిక్ మిస్సైల్ 290 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు. దీని శ్రేణి తక్కువైనా అణుబాంబు సంధానత వల్ల ప్రమాదకర ఆయుధమని రక్షణ రంగ నిపుణలన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో నిరీక్షించాల్సి ఉంది.