హైదరాబాద్ : తెలంగాణలో జరగబోయే పురపాలక ఎన్నికల్లో పోటీ చేయడం లేదని జనసేన పార్టీ ప్రకటించింది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా పోటీకి దూరంగా ఉంటున్నట్లు ఆ పార్టీ స్పష్టం చేసింది. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆసక్తి ఉన్న పార్టీ కార్యకర్తలు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయడానికి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అనుమతినిచ్చినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఎన్నికల్లో పోటీ చేసే కార్యకర్తలకు పార్టీ మద్దతు ఉంటుందని పార్టీ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ వెల్లడించారు.