బెంగళూరు: విధానసభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పరాజయానికి నైతిక బాధ్యత వహించి శాసనసభాపక్ష నాయ కత్వ పదవికి మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ప్రదేశ్ కాంగ్రెస్ సమితి అధ్యక్ష పదవికి దినేశ్ గుండూరావు సోమ వారం సాయం త్రం రాజీనామా చేసారు. రాజీనామా పత్రాల్ని పార్టీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్కు పంపినట్లు సిద్ధ రామయ్య విలేఖరులకు తెలిపారు. 15స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు స్థానాల్లో మాత్రమే విజయాన్ని సాధించింది. భాజపా సభ్యుల సంఖ్యా బలం 105 నుంచి 117కు పెరిగింది. కాంగ్రెస్, జేడీఎస్ల బలం వరుసగా 68, 34 కు కుంగి పోయింది. ముగ్గురు స్వతంత్రులున్నారు. రెండు విధానసభ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది.