అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న అల వైకుంఠపురములో చిత్రంపై అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లో సైతం అంచనాలు ఒక రేంజులో ఉన్నాయి.కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన రెండు లిరికల్ పాటలు యూట్యూబ్లో సంచలనం సృష్టించడంతో అంచనాలు పెరిగాయి.ఈ నేపథ్యంలో ఈ సినిమా డిజిటల్ రైట్స్ కి సంబంధించిన ఒక వార్త ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది.’నెట్ ఫ్లిక్స్‘వారు సినిమా డిజిటల్ రైట్స్ ను భారీ రేటుకు సొంతం చేసుకున్నట్టుగా సమాచారం. అందుకు సంబంధించిన లావాదేవీలు ఇప్పటికే పూర్తయ్యాయని అంటున్నారు.హారిక అండ్ హాసిని క్రియేషన్స్– గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పూజా హెగ్డే – నివేద పెథురాజ్ కథానాయికలుగా నటిస్తుండగా సుశాంత్ మరో కీలకపాత్రలో నటిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది..