తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో భాగంగా నాటిన మొక్కల పరిరక్షణకు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మొక్కలు, చెట్లను నరికేసిన వారికి జరిమానాలు విధిస్తున్నారు.ఈ క్రమంలో సిద్దిపేట పట్టణంలోని వైద్య కళాశాల వద్ద ఓ మొక్కను టాటా సుమో వాహనం ఢీ కొట్టడంతో ఆ మొక్క పడిపోయింది. దీంతో ఆ కారు యజమాని రాకేశ్ కు హరితహారం అధికారి సామల్ల ఐలయ్య రూ.9,500 జరిమానా విధించారు.మొక్కలకు హాని కలిగిస్తే తప్పకుండా జరిమానా చెల్లించాల్సిందేనని అన్నారు.మొక్కల సంరక్షణ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తోన్న ఐలయ్యకు అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.