మొక్కను గుద్దినందుకు జరిమానా..

మొక్కను గుద్దినందుకు జరిమానా..

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో భాగంగా నాటిన మొక్కల పరిరక్షణకు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మొక్కలు, చెట్లను నరికేసిన వారికి జరిమానాలు విధిస్తున్నారు. క్రమంలో సిద్దిపేట పట్టణంలోని వైద్య కళాశాల వద్ద మొక్కను టాటా సుమో వాహనం ఢీ కొట్టడంతో మొక్క పడిపోయింది. దీంతో కారు యజమాని రాకేశ్ కు హరితహారం అధికారి సామల్ల ఐలయ్య రూ.9,500 జరిమానా విధించారు.మొక్కలకు హాని కలిగిస్తే తప్పకుండా జరిమానా చెల్లించాల్సిందేనని అన్నారు.మొక్కల సంరక్షణ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తోన్న ఐలయ్యకు అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos