రూ.700 కోట్లు ఎక్కడివి మోదీ

రూ.700 కోట్లు ఎక్కడివి మోదీ

ఛింద్వారా:దేశ రాజధానిలో భాజపా కేంద్ర కార్యాలయ భవన నిర్మాణానికి వెచ్చించిన రూ.7౦౦ కోట్ల నగదు ఎక్కడి నుంచి వచ్చిందో తెలపాలని, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్నాథ్ శనివారం ప్రధాని నరేంద్ర మోదీని డిమాండు చేసారు. ప్రధాని విమాన ప్రయాణాల ఖర్చుల్ని ఎవ్వరు భరిస్తున్నారో దేశ ప్రజలకు తెలియాల్సి ఉందని చెప్పారు. ఈ ప్రశ్నలకు బదులిచ్చిన తర్వాత మోదీ తనను ప్రశ్నిస్తే బాగుంటుందన్నారు. కమలనాథ్ గర్భిణిలు, శిశు పౌష్టికాహారానికి కేటాయించిన ధనాన్ని చోరీ చేసి సొమ్ములను దొంగిలించి తుగ్లక్ రోడ్డుకు పంపారని నరేంద్ర మోదీ ఇటీవలి ఎన్నికల ప్రచార సభల్లో ఆరోపించారు. ఐటీ దాడుల్లో పెద్ద మొత్తంలో లభించిన సొమ్ముల్ని ఓ పెద్ద కాంగ్రెస్ నేత సమీకరించినట్లు కూడా ఆరోపించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos