24 గంటల్లో 38 కరోనా కేసులు

24 గంటల్లో 38 కరోనా  కేసులు

అమరావతి: రాష్ట్రంలో గత 24 గంటల్లో 38 కరోనా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం మధ్యాహ్నం ఇక్కడ తెలిపింది. జాల్లాల వారీగా కర్నూలులో 13, నెల్లూరులో 6, చిత్తూరు లో 5, గుంటూరులో 4, కృష్ణా 4, అనంతపురంలో 5, కడప ఒక కేసు వంతున నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 572కి చేరింది. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన 35 మంది రోగులు విడుదలయ్యారు. 14 మంది మృతి చెందారు. వివిధ ఆసుపత్రుల్లో 523 మంది చికిత్స పొందుతున్నారు.

తాజా సమాచారం