సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న గవర్నర్
విశాఖ: పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారిని ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ దంపతులు బుధవారం దర్శించుకున్నారు. ముందుగా వారికి ఆలయ అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. బేడా మండపం ప్రదక్షిణ అనంతరం వేద మంత్రాల నడుమ ఆలయ కార్యనిర్వహణాధికారి రామచంద్ర మోహన్ సంప్రదాయం ప్రకారం స్వామివారి చిత్రపటం, ప్రసాదాన్ని అందజేశారు.