షహబుద్దీన్ మేనల్లుడి కాల్చివేత..

షహబుద్దీన్ మేనల్లుడి కాల్చివేత..

సివాన్: ఆర్జేడీ మాజీ ఎంపీ మొహమ్మద్ షహబుద్దీన్ మేనల్లుడు యూసుఫ్ శుక్రవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని వ్యక్తులు ఆయనపై కాల్పులు జరపడటంతో యూసుఫ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి హంతకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రతాప్‌పూర్ పూర్ గ్రామంలో యూసుఫ్‌ను దుండగులు కాల్చిచంపినట్టు సివాన్ ఎస్‌పీ నవీన్ చందర్ మీడియాకు తెలిపారు. యూసుఫ్ ఛాతీపై దుండగులు బుల్లెట్ల వర్షం కురిపించడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడని, షహబుద్దీన్ కుమారుడు మొహమ్మద్ ఒసామాకు యూసుఫ్ అత్యంత సన్నిహతంగా మెలిగేవాడని పోలీసు వర్గాలు తెలిపాయి. సంఘటన అనంతరం షహబుద్దీన్ మద్దతుదారులు రోడ్లును దిగ్బంధించి ఈ కేసులో పోలీసులు సత్యర చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఆర్డేడీ చీప్ లాలూ ప్రసాద్ యూదవ్‌కు సన్నిహిత సహచరుడైన షహబుద్దీన్‌కు సివాన్‌లో గట్టి పట్టు ఉంది. 2015 డిసెంబర్ 9న జరిగిన ఓ హత్య కేసులో దోషిగా తేలడంతో ఆయనకు యావజ్జీవ జైలు శిక్ష పడింది. ఆయనకు పడిన శిక్షను గత ఏడాది ఆగస్టు 30న హైకోర్టు సమర్ధించింది. షహబుద్దీన్ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos