వైఎస్‌ జగన్‌పై ‘రాధా రంగ మిత్ర మండలి’ సంచలన ఆరోపణలు

వైఎస్‌ జగన్‌పై ‘రాధా రంగ మిత్ర మండలి’ సంచలన ఆరోపణలు

జిల్లాకు చెందిన కీలక నేత వంగవీటి రాధాకృష్ణ వైసీపీకి గుడ్‌ బై చెప్పేసిన సంగతి తెలిసిందే. విజయవాడ సెంట్రల్ టికెట్ ఇవ్వకుండా తూర్పు లేదా మచిలీపట్నం ఇస్తామని అధిష్టానం తేల్చడంతో తీవ్ర అసంతృప్తికి లోనైన రాధా రాజీనామా చేసేశారు. రాధా రాజీనామా లేఖలోనూ వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజీనామాకు ముందు, తర్వాత రాధాను పార్టీ మారకుండా నిలువరించాలని పలువురు కీలక నేతలతో అధిష్టానం రాయబారం నడిపినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. రాజీనామా అనంతరం రాధా ఏ పార్టీ కండువా కప్పుకుంటారన్న దానిపై ఇంత వరకూ క్లారిటీ రాలేదు. మరో రెండ్రోజుల్లో టీడీపీలో చేరతారా..? లేకుండా జనసేన కండవా కప్పుకుంటారా..? అనేది తేలిపోనుంది. టికెట్లు అమ్ముకున్నారు.. ఓటేయద్దు!ఇదిలా ఉంటే సోమవారం సాయంత్రం రాధా రంగ మిత్ర మండలి సభ్యులు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అధినేతపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వంగవీటి రాధా ఏ నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. వైఎస్ జగన్ సీట్లు అమ్ముకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు. “మాట తప్పను.. మడమ తిప్పను అంటే ఇదేనా?” అంటూ మండలి సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాధా రంగా అభిమానులెవరూ వైసీపీకి ఓటు వేయొద్దని ఈ సందర్భంగా విజయవాడతో పాటు రాష్ట్ర ప్రజలకు రాధా రంగ మిత్ర మండలి సభ్యులు పిలుపునిచ్చారు. అయితే ఈ ఆరోపణలపై వైసీపీ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాల్సిందే.

తాజా సమాచారం