నేపియర్: ఐదు వన్డేల సిరీస్లో భాగంగా నేపియర్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్లో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. 59 బంతులు ఆడిన కెప్టెన్ విరాట్ కోహ్లీ 45 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. న్యూజిలాండ్ క్రీడాకారుడు లాకీ ఫెర్గసన్ బౌలింగ్లో విరాట్ కోహ్లీ లాథమ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. భారత్ విజయానికి మరో 14 పరుగుల దూరంలో ఉంది. ప్రస్తుతం భారత్ 31.1 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది.