ఉజ్జయిని: మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఉజ్జయిని జిల్లా రామ్గఢ్ సమీపంలో మరో వాహనం వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొనడంతో 12 మంది మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయినట్లు అధికారులు తెలిపారు. కాగా, మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా వెల్లడించారు. ఒక వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా రామ్గఢ్లోని నగ్డా రోడ్డు వద్ద వేరే వాహనం వ్యాన్ను ఢకొీట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఈ దుర్ఘటన సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.