రాజకీయాల్లోకి డార్లింగ్..మోడీషా మాస్టర్ ప్లాన్!

డార్లింగ్ అన్నంతనే గుర్తుకొచ్చే నటుడు ప్రభాస్. బాహుబలితో అనితర సాధ్యం కాని ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఆయన తాజాగా రెండు సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు. ఒక సినిమా కోసం ఐదేళ్ల కాలాన్ని వెచ్చించే సాహసాన్ని ఏ హీరో చేయరు. కానీ.. తాను అందరికంటే భిన్నమన్న విషయాన్ని చెబుతూ బాహుబలి కోసం ఆయన పడిన కష్టం.. వెచ్చించిన కాలం ఆయనకు వడ్డీతో సహా  తిరిగి వచ్చిందని చెప్పాలి.

బాహుబలి పుణ్యమా అని దేశ వ్యాప్తంగా స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు. ఆ సినిమా తర్వాత ఆయన చిత్రాలకు దేశ వ్యాప్తంగా మార్కెట్ వచ్చేసింది. ప్రస్తుతం రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సాహో చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఊహించని రీతిలో ఒక కొత్త వార్త డార్లింగ్ ప్రభాస్ మీద వచ్చింది.ఒక ఆంగ్ల మీడియా సంస్థ ప్రత్యేక కథనాన్ని అచ్చేసింది. అందులో ప్రభాస్ ను ఏపీ ఎన్నికల బరిలోకి దించుతారంటూ వార్తను ప్రచురించారు. కెరీర్ పీక్స్ లో ఉన్న వేళ.. హటాత్తుగా రాజకీయాలేమిటన్న సందేహం వ్యక్తమవుతున్న వేళ.. సౌత్ లో తమ సత్తా చాటేందుకు కమలనాథులు భారీ వ్యూహాన్ని రచిస్తున్నారు. అందులో భాగంగానే ప్రభాస్ ను ఎన్నికల గోదాలోకి దింపుతారంటూ సదరు మీడియా సంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది. త్వరలో జరిగే ఎన్నికల్లో మరీ ముఖ్యంగా ఏపీలో తన సత్తాను చాటేందుకు క్రౌడ్ పుల్లింగ్ కోసమైనా ప్రభాస్ ను బీజేపీ బరిలో నిలపాలన్న ఆలోచనలో పార్టీ అధినాయకత్వం ఆలోచిస్తుందని చెబుతున్నారు. ఇప్పటికే ఏపీ బీజేపీ నేతలకు దీనికి సంబంధించిన సమాచారాన్ని బీజేపీ అధినాయకత్వం అందించినట్లుగా తెలుస్తోంది.ప్రభాస్ కు పెద్దనాన్న అయిన కృష్ణంరాజుకు బీజేపీకి మధ్యనున్న సంబంధాల గురించి తెలిసిందే. తాజాగా ఆయనకు గవర్నర్ పోస్ట్ ఇవ్వటం.. అదే సమయంలో ఎన్నికల గోదాలోకి ప్రభాస్ ను దించటం ద్వారా ఏపీలో తమ సత్తా చాటే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రానున్న కొద్ది రోజుల్లో వీరిద్దరిని ఢిల్లీకి పిలిపించి అన్ని విషయాలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. మరి.. రాజకీయాల్లోకి వెళ్లే విషయంపై డార్లింగ్ ఎప్పటికి పెదవి విప్పుతారో చూడాలి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos