బెంగళూరు : భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ. సింధు యుద్ధ విమానంలో వాయు విహారం చేసింది. తేలికపాటి యుద్ధ విమానం (తేజస్)లో ఆమె విహరించింది. ఇక్కడ జరుగుతున్న ఎయిర్ షోలో ఏరో ఇండియా శనివారం మహిళా దినోత్సవాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా సింధుకు తేజస్లో కో-పైలట్గా వ్యవహరించే అవకాశాన్ని కల్పించారు. తేజస్ ను హెచ్ఏఎల్ తయారు చేసింది. బాంబులు, ఆయుధాలు, ఎలక్ట్రానిక్ యుద్ధ సూట్లను కలిగి ఉండడంతో పాటు గాలిలోనే ఇంధనాన్ని నింపుకునే సామర్థ్యం… ఈ విమానం ప్రత్యేకతలు.