మోదీని చంపేస్తానంటూ బెదిరింపులు…అరెస్ట్

మోదీని చంపేస్తానంటూ బెదిరింపులు…అరెస్ట్

న్యూఢిల్లీ : సాక్షాత్తూ దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీని చంపేస్తానంటూ ఓ టైలర్ ఏకంగా పోలీసుకంట్రోల్ రూంకు ఫోన్ చేసిన ఘటన దేశరాజధాని నగరమైన ఢిల్లీలో సంచలనం రేపింది. సెంట్రల్ ఢిల్లీ పరిధిలోని ఆనంద్ పర్బత్ ప్రాంతంలో టైలర్ షాపు నడుపుతున్న ముక్తియార్ అలీ (53) పోలీసు కంట్రోల్ రూం కు ఫోన్ చేసి ప్రధాని మోదీని హతమారుస్తానని హెచ్చరించాడు. ఈ ఫోన్ కాల్ తో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు, ఇంటలిజెన్స్ అధికారులు ఫోన్ చేసిన వ్యక్తి ముక్తియార్ అలీని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. పోలీసు కంట్రోల్ రూం కు ఫోన్ చేసిన తర్వాత ఫోన్ ను స్విచాఫ్ చేశాడు. వ్యాపారంలో నష్టపోయిన ముక్తియార్ మద్యం తాగి, ఆ మత్తులో పోలీసు కంట్రోల్ రూంకు ఫోన్ చేశాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. ముక్తియార్ మంచివాడేనని, ఇతనిపై గతంలో కేసులేమి లేవని పోలీసులు చెప్పారు. దీంతో నిందితుడికి సైకియాట్రిక్ పరీక్ష చేయించి, కేసు నమోదు చేస్తామని పోలీసులు పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos