మధ్యప్రదేశ్‌లో రోడ్డెక్కిన బీజేపీ నేతలు

భోపాల్: మధ్యప్రదేశ్‌లో శాంతిభద్రతలు క్షీణించాయంటూ బీజేపీ కార్యకర్తలు భోపాల్‌లో ఆందోళనకు దిగారు. కమల్‌నాథ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి దిష్టిబొమ్మలను తగులబెట్టారు. భారీ సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు రోడ్డుపైకి వచ్చి ఆందోళనకు దిగడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. తమ పార్టీ కార్యకర్తలు, నేతలు హత్యలకు గురవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మనోజ్ థాక్రే అనే బీజేపీ నేతను ఇటీవలే దుండగులు హత్య చేశారు. ఆ ఘటన మరువక ముందే మరో బీజేపీ నేత, ఆయన కుటుంబ సభ్యులను దోపిడీ దొంగలు దోచుకున్నారు. ఒకవైపు రాష్ట్రంలో అరాచకాలు పెరుగుతున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టనట్టు ఉందని మాజీ సీఎం శివరాం సింగ్ చౌహాన్ మండిపడ్డారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos