కోల్కతా : మమతా బెనర్జీసారథ్యంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, కేంద్రం మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో దీనికి కేంద్ర బిందువైన కోల్కతా పోలీస్ కమిషనర్ నివాసంపై సీబీఐ దాడుల ఉదంతానికి సంబంధించి రహస్య నివేదికను బెంగాల్ గవర్నర్ కేంద్రానికి సమర్పించారు. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ బెంగాల్ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠితో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని సమీక్షించిన మీదట కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు గవర్నర్ నివేదికను పంపారు.