బాలకృష్ణపై పోటీకి దిగుతున్న టీవీ యాంకర్

బాలకృష్ణపై పోటీకి దిగుతున్న టీవీ యాంకర్

మీరు చదివింది నిజమే.. రాబోయే ఎన్నికల్లో హిందూపూర్ నియోజకవర్గం నుంచి నందమూరి బాలకృష్ణపై ఓ టీవీ యాంకర్ పోటీ చేయబోతోంది. ఆమె పేరు శ్వేతా రెడ్డి. గతంలో పలు టీవీ ఛానెళ్లలో యాంకరింగ్ చేసిన ఈ అమ్మాయిని తన పార్టీలో తీసుకున్నారు కేఏ పాల్. ప్రజాశాంతి పార్టీపై రాబోయే ఎన్నికల్లో హిందూపురం నియోజకవర్గం నుంచి ఈమె పోటీచేయబోతోంది.

తన పార్టీ కేవలం  ఏ ఒక్క కులానికో చెందినది కాదని అందుకే రెడ్డి వర్గానికి చెందిన శ్వేతాకు టిక్కెట్ ఇచ్చానని ప్రకటించారు కేఏపాల్. ప్రస్తుతం ప్రజాశాంతి పార్టీ కోసం 44వేల మంది కో-ఆర్డినేటర్లు పనిచేస్తున్నారని.. వాళ్లంతా రాబోయే రోజుల్లో 2 కోట్ల మందిని తమ పార్టీలోకి చేరుస్తారని అంటున్నారు పాల్.కేవలం శ్వేతారెడ్డి మాత్రమే కాకుండా.. కాపు – యాదవ – మాల – మాదిగ కులస్తులందరికీ టిక్కెట్లు ఇస్తామని ప్రకటించారు కేఏ పాల్. తను తలుచుకుంటే విదేశాలకు వెళ్లి లక్ష కోట్లు తెస్తానని – ఒక్కో నియోజకవర్గం అభివృద్ధికి వంద కోట్లు తేగలనని అంటున్నారు పాల్. మొదట్లో కేఏ పాల్ ఇంటర్వ్యూల కోసం క్యూ కట్టిన ఛానెళ్లు ప్రస్తుతం ఆయన్ను చూపించడం మానేశాయి. స్టుడియోలకు పిలవడం తగ్గించేశాయి. దీని వెనక చంద్రబాబు కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు పాల్.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos