బారాముల్లాలో హోరాహోరీ కాల్పులు

బారాముల్లాలో  హోరాహోరీ కాల్పులు

శ్రీనగర్: జమ్మూ-కశ్మీర్‌ బారాముల్లా జిల్లా వార్‌పొరా ప్రాంతంలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య శుక్రవారం ఉదయం హోరాహోరీ కాల్పులు సంభవించాయి. లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)కి చెందిన ముగ్గురు ఉగ్రవాదులు ఈ ప్రాంతంలో నక్కినట్టు భావిస్తున్నారు. తీవ్రవాదుల కదలికలు ఉన్నట్టు నిఘా వర్గాల నుంచి సమాచారం అందండంతో గురువారం రాత్రి నుంచి భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. రాష్ట్రీయ రైఫిల్స్ (ఆర్ఆర్), జమ్మూ- కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా పోరులో పాల్గొంటున్నారు. పౌరుల భద్రత దృష్ట్యా సోపోర్‌ ప్రాంతంలో 144 సెక్షన్ విధించి, ఇంటర్నెట్ సేవలను నిలిపివేసినట్టు అధికారులు పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos