తిరుమల:పుల్వామా
ఉగ్రదాడికి నైతిక బాధ్యత వహించి ప్రధాని పదవికి నరేంద్ర మోది రాజీనామా చేయాలని
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
డిమాండు చేయటం సిగ్గుచేటని వైసీపీ విధానసభ సభ్యులు రోజా వ్యాఖ్యానించారు. గురువారం ఇక్కడ మాధ్యమ
ప్రతినిధులతో మాట్లాడారు. పుష్కరాల్లో 30 మంది అకాల
మృత్యువాతపడినపుడు రాజీనామా చేశారా అని చంద్రబాబును నిలదీశారు. చంద్రబాబు విధానాలు నచ్చకే చాలా
మంది తెదేపా నాయకులు తమ పార్టీలోకి చేరుతున్నారని చెప్పారు. మోదీ, కేసీఆర్తో కలిసి కుట్ర చేస్తే తెదేపా
ఖాళీ అయిపోతుందని పేర్కొన్నారు. . దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చింతమనేనిపై చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకో లేదని ప్రశ్నించారు.