ముంబై : భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) అధ్యక్షుడు మోహిత్ కాంబోజ్ తన పేరు మార్చుకున్నారు. తన పేరు చివర ‘భారతీయ’ అని చేర్చుకున్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను ‘ప్రౌడ్ భారతీయ’ అనే సంస్థను నడుపుతున్నానన్నారు. ప్రజలంతా భారతీయతతో గుర్తింపు పొందేలా ప్రోత్సహించడమే తమ సంస్థ లక్ష్యమని చెప్పారు. తమ సంస్థ సాధించాలనుకుంటున్నదానికి మొదటి ఉదాహరణగా తాను నిలిచేందుకు తన పేరు చివర ‘భారతీయ’ అని చేర్చుకున్నట్లు తెలిపారు. ఇకపై తనను మోహిత్ కాంబోజ్ భారతీయ అని పిలవాలని కోరారు. అధికారిక గెజిట్లో కూడా ఈ నూతన నామం ప్రచురితమైందన్నారు.