పాండ్యా పశ్చాత్తాపం

  • In Sports
  • January 16, 2019
  • 759 Views
పాండ్యా పశ్చాత్తాపం

సూరత్‌: ఓ టీవీ కార్యక్రమంలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన క్రికెటర్లు హార్దిక్‌ పాండ్య, కేఎల్‌ రాహుల్‌ ఆస్ట్రేలియాలో జరుగుతున్న వన్డేలకు దూరమయ్యారు. ఈ ఘటనతో పాండ్య చాలా డిస్టర్బ్‌ అయ్యాడు. ఇంట్లో నుంచి బయటికి రావడానికి కూడా పాండ్య భయపడుతున్నాడని అతని తండ్రి హిమాన్షు మీడియా ద్వారా వెల్లడించారు. కనీసం ఫోన్ కాల్స్‌ కూడా ఎత్తడంలేదని తెలిపారు. ‘ఇంటికి వచ్చినప్పటి నుంచి బయటకు వెళ్లింది లేదు. కనీసం ఎవరైనా ఫోన్‌ చేసినా కూడా లిఫ్ట్‌ చేయడంలేదు. విరామం తీసుకుంటున్నాడు’ ‘సంక్రాంతి పండుగ రోజు కూడా పాండ్య చాలా డల్‌గా ఉన్నాడు. పాండ్యకు పతంగులు ఎగురవేయడం అంటే చాలా ఇష్టం. గత కొన్నేళ్లుగా పాండ్య ఆట నేపథ్యంలో ఇంటికి దూరంగా ఉన్నాడు. దాంతో పండుగలు జరుపుకొనే అవకాశం రాలేదు. ఇప్పుడు ఇంట్లో ఉండి కూడా పతంగులు ఎగురవేడయానికి ఇష్టపడలేదు. బీసీసీఐ సస్పెండ్‌‌ చేయడంతో బాధపడుతున్నాడు. టీవీ షోలో తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నాడు. మళ్లీ ఇలాంటి తప్పు చేయనన్నాడు. ఈ విషయం గురించి పాండ్యతో మాట్లాడదలచుకోలేదు. అతని సోదరుడు కృనాల్‌ కూడా ఈ విషయంపై మౌనంగా ఉన్నాడు. బీసీసీఐ తదుపరి నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాం’ అని హిమాన్షు మీడియా ద్వారా వెల్లడించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos