పంచాయతీ పోరు.. కారుదే జోరు

పంచాయతీ పోరు.. కారుదే జోరు

తెలంగాణలో తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో తెరాస ప్రభంజనం సృష్టించింది. ఆ పార్టీ మద్దతుదారులు భారీ సంఖ్యలో విజయ ఢంకా మోగించారు. సగానికి పైగా సీట్లలో గులాబీ జెండా రెపరెపలాడగా.. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ మినహా మిగతా పార్టీలేవీ పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. స్వతంత్ర అభ్యర్థులు చాలా చోట్ల తమ బలం నిరూపించుకున్నారు. తొలిదశలో 3701 పంచాయతీల్లో సర్పంచ్‌ పదవులకు పోలింగ్‌ జరిగింది. తొలి దశలో జరిగిన ఎన్నికల్లో మొత్తంగా తెరాస 2629, కాంగ్రెస్‌ 920, తెదేపా 31, భాజపా 67, సీపీఐ 19, సీపీఎం 32, ఇతరులు 758 చోట్ల విజయం సాధించారు. పలు కారణాల వల్ల 14 పంచాయతీల్లో ఫలితాలు ఇంకా వెలువడలేదు.

తొలి దశలో 4479 గ్రామ పంచాయతీలకు ఎన్నికలకు నోటీసు ఇవ్వగా.. తొమ్మిది పంచాయతీలకు నామినేషన్లు దాఖలు కాలేదు. 769 పంచాయతీల్లో సర్పంచ్‌ పదవులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 3701 పంచాయతీ సర్పంచి పదవులకు పోలింగ్‌ జరిగింది. మరోవైపు పల్లెల్లో ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. ఎన్నికల్లో 85.76 శాతం పోలింగ్‌నమోదైంది. మొత్తంగా 41,56,414 ఓట్లు పోలయ్యాయి.యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 95.32 శాతం, రాజన్న సిరిసిల్ల జిల్లాలో అతి తక్కువగా..78.47 శాతం ఓట్లు పోలయ్యాయి. 

తాజా సమాచారం