నేషనల్‌ ఛాంపియన్‌ షిప్‌కు రామకుప్పం విద్యార్థులు

  • In Local
  • February 2, 2019
  • 775 Views

చిత్తూరు : ఉత్తరప్రదేశ్‌ నోయిడాలో నిర్వహించనున్న నేషనల్‌ ఛాంపియన్‌ షిప్‌కు రామకుప్పం విద్యార్థులు ఎంపికయ్యారు. స్కూల్‌ స్పోర్ట్స్‌ ప్రమోషన్‌ ఫౌండేషన్‌ ఆంధ్రప్రదేశ్‌ క్రికెట్‌ జట్టుకు చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలోని ఇద్దరు విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు విద్యార్థులు దుర్గా ప్రసాద్‌, నవీన్‌ కుమార్‌లను పలువురు శనివారం అభినందించారు. కుప్పం క్లస్టర్‌ కో ఆర్డినేటర్‌ నరేష్‌ బాబు మాట్లాడుతూ.. ఈ ఇద్దరు విద్యార్థులు ఉత్తరప్రదేశ్‌ నోయిడాలో ఈ నెల 3 వ తేదీ నుండి 8 వ తేదీ వరకు నిర్వహించనున్న నేషనల్‌ ఛాంపియన్‌ షిప్‌ లో పాల్గననున్నారని ప్రకటించారు. దుర్గా ప్రసాద్‌ విజలాపురం ఉన్నత పాఠశాలలో 10 వ తరగతి చదువుతుండగా, నవీన్‌ కుమార్‌ శ్రీ శారదా విజలాపురం పాఠశాలలో చదువుతున్నాడు. ఇద్దరు విద్యార్థులను వారి పాఠశాల హెడ్‌ మాస్టర్‌ హరి బాబు, శారదా స్కూల్‌ కరెస్పాండంట్‌ మంజునాథ్‌, ప్రవీణ్‌, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అభినందించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos