చిత్తూరు : ఉత్తరప్రదేశ్ నోయిడాలో నిర్వహించనున్న నేషనల్ ఛాంపియన్ షిప్కు రామకుప్పం విద్యార్థులు ఎంపికయ్యారు. స్కూల్ స్పోర్ట్స్ ప్రమోషన్ ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ క్రికెట్ జట్టుకు చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలోని ఇద్దరు విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు విద్యార్థులు దుర్గా ప్రసాద్, నవీన్ కుమార్లను పలువురు శనివారం అభినందించారు. కుప్పం క్లస్టర్ కో ఆర్డినేటర్ నరేష్ బాబు మాట్లాడుతూ.. ఈ ఇద్దరు విద్యార్థులు ఉత్తరప్రదేశ్ నోయిడాలో ఈ నెల 3 వ తేదీ నుండి 8 వ తేదీ వరకు నిర్వహించనున్న నేషనల్ ఛాంపియన్ షిప్ లో పాల్గననున్నారని ప్రకటించారు. దుర్గా ప్రసాద్ విజలాపురం ఉన్నత పాఠశాలలో 10 వ తరగతి చదువుతుండగా, నవీన్ కుమార్ శ్రీ శారదా విజలాపురం పాఠశాలలో చదువుతున్నాడు. ఇద్దరు విద్యార్థులను వారి పాఠశాల హెడ్ మాస్టర్ హరి బాబు, శారదా స్కూల్ కరెస్పాండంట్ మంజునాథ్, ప్రవీణ్, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అభినందించారు.