నకిలీ నోట్ల ముఠా అరెస్టు

  • In Crime
  • January 24, 2019
  • 773 Views
నకిలీ నోట్ల ముఠా అరెస్టు

విజయవాడ బస్సులో నకిలీ నోటుతో టిక్కెట్లు కొనటానికి ప్రయత్నించిన సభ్యుడు

నకిలీ నోటును గుర్తించిన కండక్టర్

ప్రయాణికుల సాయంతో నిందితుడ్ని పట్టుకుని పోలీసులకు అప్పగింత

మొత్తం 11 మంది నకిలీ నోట్ల ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు

కోదాడ నుంచి విజయవాడకు వెళ్తున్న నకిలీ నోట్ల ముఠాను కంచికచర్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోదాడ నుంచి విజయవాడ వెళ్తున్న బస్సులో ఓ వ్యక్తి కండక్టర్ కి 500 రూపాయలు చెల్లించి విజయవాడకు మూడు టిక్కెట్లు తీసుకున్నాడు. కాసేపటికి ఆ ఐదు వందల రూపాయలు నకిలీది అని గమనించిన కండక్టర్ బస్సును కంచికచెర్ల పోలీస్టేషన్ ముందు నిలపటంతో నిందితుడు పారిపోయే ప్రయత్నం చేశాడు. ప్రయాణీకుల సాయంతో ఆ వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించగా అతని వెనుక 11 మంది సభ్యుల ముఠా ఉన్నట్టుగా తేలింది.తెలంగాణా లోని మునగాలకు చెందిన ఈ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos