ప్రజలకు దేశంపై ప్రేమ ఉందా లేకపోతే ప్రధాని మోడీపై ప్రేమ ఉందా తేల్చుకోవాలని ఢిల్లి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లి ప్రభుత్వ పాఠశాలల్లో 11 వేల తరగతి గదులను నిర్మించడానికి ఉప ముఖ్యమంత్రి సిసోడియాతో కలిసి కేజ్రీవాల్ శంకుస్థాపన చేశారు. అనంతరం సర్వోదయా కన్యా విద్యాలయలో జరిగిన సభలో కేజ్రీవాల్ మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నారో తేల్చుకోవాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఎక్కువగా ప్రేమిస్తుంటే పిల్లల కోసం కృషి చేస్తున్న వారికి ఓటేయాలని కోరారు. తమ పిల్లలను ప్రేమించకపోతే మోడీజీకి ఓటేయండి అని కేజ్రీ వాల్ అన్నారు. ప్రధాని మోడీ తన పదవీ కాలంలో ఒక స్కూల్ను లేదా తరగతి గదిని నిర్మించలేదని ఆయన చెప్పారు.