దావోస్లో కమల్ హాసన్ వ్యాఖ్యలు

దావోస్ : ప్రముఖ నటుడు కమల్ హాసన్ భారతీయ జనతా పార్టీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. దావోస్ మేధోమథనంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ దేశ ప్రజలను బుద్ధిహీనులనుకుంటోందని వ్యాఖ్యానించారు. రైతులను వెర్రివాళ్ళను చేస్తోందని, అగ్ర వర్ణాల పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ల పేరుతో ఆ వర్గాలవారిని ఫూల్ చేస్తోందన్నారు. ఓటర్లను ఫూల్ చేయడానికే నరేంద్ర మోదీ ప్రభుత్వం పని చేస్తోందని దుయ్యబట్టారు. మధ్యప్రదేశ్‌లో ఐదుగురు ఎమ్మెల్యేలను కొనేందుకు ఆ పార్టీ ప్రయత్నించిందని ఆరోపించారు.

తాజా సమాచారం