రంగారెడ్డి : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అన్ని వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించేలా ఆదేశించాలని మల్రెడ్డి రంగారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టు బుధవారం విచారించింది. ఈ నెల 30 న ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలను సమర్పించాలని తెలంగాణ ఎన్నికల సంఘాన్ని కోర్టు ఆదేశించింది. బిఎస్పి తరపున పోటీ చేసిన మల్రెడ్డి రంగారెడ్డి 376 ఓట్ల తేడాతో ఓటమిపాలైన విధితమే.