తన భర్తను వివాహం చేసుకుందని

తన భర్తను వివాహం చేసుకుందని

తన భర్తతో కొంతకాలంగా అక్రమ సంబంధం పెట్టుకుందన్న నెపంతో మొదటి భార్య సదరు మహిళను నడిబజారులో చితకబాదిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా కథలాపూర్‌ మండలం కలికోట గ్రామశివారు తండాకు చెందిన దరావత్‌ రాజు అనే వ్యక్తి కలికోట గ్రామానికి చెందిన భర్తతో విడా కులై ఇద్దరు పిల్లలున్న వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. గత నెల 30న రాజు ఆ మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. ఈవిషయం తెలుసుకున్న మొదటి భార్య దరావత్‌ పూర్బన్‌ కథలాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించగా ఆ మహిళకు కౌన్సిలింగ్‌ ఇచ్చి వదిలిపెట్టారు. దీంతో అప్పటి నుండి కక్ష పెట్టుకున్న రాజు భార్య కుటుంబసభ్యులు గురువారం రుద్రంగికి రాజును రెండో వివాహం చేసుకున్న సాయవ్వ వచ్చినట్లు గమనించిన మొ దటి భార్య దరావత్‌పూర్బాన్‌, కుమారుడు మోహన్‌ రుద్రం గిలోని వేముల వాడ-కోరుట్ల ప్రధాన రహదారిలోని ఇందిరాచౌక్‌ ప్రాంతంలో సాయవ్వను చితకబాది తాడుతో మెడకు ఉరిపెట్టి చంపేందుకు యత్నించగా గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరువురు మహిళలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం బాధిత మహిళను చికిత్స నిమిత్తం సిరిసిల్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos