అమరావతి: బీసీలకు అన్యాయం చేసిన వారితో జగన్ అంటకాగుతున్నారని సీఎం చంద్రబాబు విమర్శించారు. టీఆర్ఎస్తో జతకట్టిన వైసీపీకి బీసీలే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అవినీతి గొంగళి పురుగును కేసీఆర్ కౌగలించుకున్నారని వ్యాఖ్యానించారు. జగన్తో స్నేహం తెలంగాణ కోసమేనా.. కేసీఆర్, కేటీఆర్ జవాబివ్వాలన్నారు. మోదీ చెప్పింది చేయడమే కేసీఆర్ కర్తవ్యమని సీఎం వ్యాఖ్యానించారు. మోదీ చేతిలో జగన్ కీలుబొమ్మ అని అన్నారు. బీజేపీ, టీఆర్ఎస్, వైసీపీ కుట్రలకు ప్రజలే బుద్ధి చెబుతారని చంద్రబాబు తెలిపారు.