ఎయిర్సెల్ మాక్సిస్ కేసులో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర ఆర్థికమంత్రి పీ చిదంబరం,.ఆయన కుమారుడు కార్తీ కి మరోసారి ఊరట .ఇద్దరినీ
మార్చి 8 వరకు అరెస్ట్ చేయకుండా ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం సోమవారం ఆదేశించింది. ఈ కేసులలో ప్రశ్నించడానికి మార్చి 5,
6, 7, 12 తేదీల్లో సీబీఐ కోర్టుకు హాజరు కావాల్సి ఉందని ఇ.డి.
న్యాయస్థానానికి తెలపటంతో విచారణను మార్చి12కి వాయిదా వేసింది. కేసు వాయిదాను చిదంబరం
వ్యతిరేకించారు. ఈడీ కావాలనే ఆలస్యం చేస్తోందని ఆరోపించారు.
2006లో చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఎయిర్సెల్-మ్యాక్సిస్ వ్యవహారంలో విదేశీ పెట్టుబడుల ప్రమోషన్ బోర్డు(ఎఫ్ఐపిబి) ఆమోదం విషయంలో కార్తి చిదంబరం అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. వీటి
గురించి సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.