చెన్నై: అతి పొడవైన దోశ వేసి రికార్డు సృష్టించారు చెన్నైకు చెందిన హోటల్ శరవణ భవన్ వంట మాస్టర్లు. మద్రాస్ ఐఐటీ ప్రాంగణం దీనికి వేదికైంది. 62 మంది చెఫ్లు, ఇతర సిబ్బంది కలిసి శుక్రవారం 105 అడుగుల దోశ వేసేందుకు ప్రయత్నించి రెండుసార్లు విఫలమయ్యారు. మూడోసారి 82 అడుగుల దోశని విజయవంతంగా సిద్ధం చేశారు. హైదరాబాద్లో 2014లో వేసిన 54 అడుగుల దోశ గిన్నిస్లో చోటు దక్కించుకుందని, ప్రస్తుతం దాన్ని అధిగమించామని నిర్వాహకులు చెప్పారు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులకు వివరాలు పంపినట్లు తెలిపారు. దీనిని ఏషియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదు చేశారు.