గాంధీజీని మరోసారి చంపేశారు

గాంధీజీని మరోసారి చంపేశారు

పిచ్చి ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. కొంతమంది సరదా కోసం పిచ్చి పనులు చేస్తారు. ఇంకొంతమంది మాత్రం మీడియాలో కన్పించాలనే గులతో తలతిక్క పనులు చేస్తారు. మరికొంతమంది మాత్రం మదమెక్కి చేస్తారు. అలాంటికోవలోకే వస్తారు ఉత్తరప్రదేశ్లోని హిందూ మహాసభ కార్యకర్తలు. గాంధీజీ వర్ధంతి రోజు.. మరోసారి గాంధీని అతి దారుణంగా చంపేశారు హిందూ మహాసభ కార్యకర్తలు.        
ఈ హిందూ మహాసభలో ఉన్నవాళ్లంతా దాదాపు పిచ్చివాళ్లే. గాంధీ వేరే మతస్తుడని.. గాంధీని చంపిన గాడ్సే అసలు సిసలు హిందువని నమ్ముతారు. అందుకే గాంధీ వర్ధంతి రోజు.. ఘాతుకానికి ఒడిగట్టారు. గాంధీ దిష్టిబొమ్మను తగలబెట్టారు. గాంధీజీ దిష్టిబొమ్మను తయారుచేసి.. దాన్ని తుపాకులతో కాల్చుతున్నట్లు మీడియాకు ఫోజులిచ్చారు.  కాల్చిన తర్వాత గాంధీజి శరీరం నుంచి రక్తం వస్తున్నట్లుగా కూడా చూపించి పైశాచిక ఆనందం పొందారు. గాంధీ మన జాతిపిత. దేశ స్వాతంత్ర్యం కోసం తన జీవితాన్ని పణంగా పెట్టాడు. విదేశీయులు గాంధీ గొప్ప తనాన్ని కీర్తించారు. మనవాళ్లు మాత్రం వెర్రితనంతో పిచ్చివేషాలు వేస్తున్నారు. ఇలా వేరే దేశంలో చేస్తే.. నడిరోడ్డుమీద ఉరేస్తారు. మన హిందుత్వా అని చెప్పుకునే యోగి ఆదిత్యనాథ్ వీళ్లపై ఏం చర్యలు తీసుకుంటాడో.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos