కర్ణాటక రాజకీయాల్లో హైడ్రామా

బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో హైడ్రామా కొనసాగుతోంది. జేడీయూ, కాంగ్రెస్ సంక్షేమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న ఆరోపణల నేపథ్యంలో సోమవారం బెంగళూరులో మరోసారి మాజీ సీఎం సిద్ధరామయ్య సీఎల్పీ భేటీని ఏర్పాటు చేశారు. మొన్న జరిగిన సీఎల్పీ సమావేశానికి నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఇవాల్టీ సమావేశానికి హాజరుకాని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిద్ధరామయ్య హెచ్చరించారు. ఈ సమావేశంలో బీజేపీ అనుసరిస్తున్న వ్యూహాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీలో అవిశ్వాసం పెట్టేందుకు బీజేసీ సభ్యులు ప్రయత్నిస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. గవర్నర్‌ను కలిసి బలపరీక్ష కోరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దాంతో బీజేపీ వ్యూహాలను తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos