ఓట్ల తొలగింపు వదంతే

ఓట్ల తొలగింపు వదంతే

అమరావతి:ఆంధ్రప్రదేశ్‌లో అర్హులైన ఓటర్ల పేర్లను జాబితాల నుంచి తొలగించలేదని  ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది. గురువారం ఇక్కడ మాధ్యమ ప్రతినిధుల సమావేశలో స్పష్టీకరించారు. ఓట్ల తొలగింపు అనేది వదంతి మాత్రమే ఎవరూ నమ్మరాదని విన్నవించారు. వచ్చే  23, 24 తేదీల్లో పోలింగ్‌ కేంద్రాల స్థాయిలో  నిర్వహించనున్న ఓటర్ల జాబితా శిబిరాల్లో గత జనవరి 11 వరకు దాఖలైన ఓటర్ల జాబితాను తనిఖీ చేసుకోవచ్చని చెప్పారు. నామపత్రాల దాఖలు  చివరి రోజు వరకు జాబితాలో మార్పులు, చేర్పులకు అవకాశం ఉందన్నారు. విశాఖ, తిరుపతి, విజయవాడలో కేంద్ర ఎన్నికల బృందాలు తనిఖీలు చేయనున్నట్లు చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos