ఇండియా గేట్ దగ్గర బాంబు ఉందంటూ ఫోన్..

ఇండియా గేట్ దగ్గర బాంబు ఉందంటూ ఫోన్..

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గర బాంబు ఉందంటూ పోలీసులకు ఫోన్ రావడంతో ఆ ప్రాంతంలో కలకలం చెలరేగింది. వెంటనే పీసీఆర్ వ్యాన్, బాంబు నిరోధక స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో పాటు భారీగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ముమ్మర తనిఖీలు చేపట్టారు. అయితే వారికి ఎటువంటి బాంబు లభ్యంకాలేదు. అది ఫేక్ కాల్ అని తేలింది. దీంతో పోలీసులు బాంబు బెదిరింపు ఫోను చేసిన వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు. ఈ కాల్ తిలక్‌మార్గ్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఆనంద్ పర్వత్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి నుంచి వచ్చిందని తేలింది. అతనిని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నించగా మద్యం మత్తులో ఫోను చేసినట్టు అతను తెలిపాడు. దీంతో పోలీసులు అతనిని అరెస్టు చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos