ఆ పంచాయతీలో 35 ఓట్లే..!
పాల్వంచ గ్రామీణం, న్యూస్టుడే: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం దొంగతోగు గ్రామ జనాభా 106 మంది మాత్రమే. ఎస్టీ మహిళకు రిజర్వు అయిన ఈ పంచాయతీలో మొత్తం ఓట్లు 35 మాత్రమే. ఇందులో పురుషులు 18 మంది కాగా.. స్త్రీలు 17 మంది ఉన్నారు. ఇదే మండలంలోని అడివిరామవరం పంచాయతీలో మొత్తం ఓటర్లు 62 మంది మాత్రమే. ఈ పంచాయతీని ఎస్టీ జనరల్కు రిజర్వు చేశారు.