ఆ ఇద్దరూ బీజేపీ ఏజెంట్లు: మాయావతి

ఆ ఇద్దరూ బీజేపీ ఏజెంట్లు: మాయావతి

లక్నో: ములాయం సింగ్ యాదవ్ సోదరుడు, అఖిలేష్ యాదవ్ బాబాయి శివపాల్ యాదవ్ ఏర్పాటు చేసిన ప్రగతిశీల సమాజ్‌వాదీ పార్టీ (లోహియా)పై బీఎస్పీ అధినేత్రి మాయావతి నిప్పలు కురిపించారు. శివపాల్ యాదవ్ పార్టీ ‘బీజేపీ ముసుగు పార్టీ’ అని ఆరోపించారు. శివపాల్ యాదవ్, రాజా భయ్యాల వెనుక బీజేపీ ఉండి నడిప్తోందని, ఓట్లను చీల్చేందుకు వారికి డబ్బులు గుప్పిస్తోందని ఆమె ఆరోపించారు.శనివారంనాడిక్కడ అఖిలేష్ యాదవ్‌తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న మాయావతి మాట్లాడుతూ, శివపాల్ యాదవ్, తదితరులు నడిపిస్తున్న పార్టీ పట్ల ఎస్పీ-బీఎస్‌పీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆ పార్టీకి బీజేపీ డబ్బులు గుప్పిస్తూ కుట్రకు పన్నాగాలు పన్నుతోందన్నారు. ప్రగతిశీల సమాజ్‌వాదీ పార్టీ వలలో కార్యకర్తలు చిక్కుకోవద్దని, ఓట్లను చీల్చడం, బీజేపీకి సహకరించడమే వాళ్ల (శివపాల్, రాజాభయ్యా) ప్రధాన లక్ష్యమని అన్నారు. ఎస్పీ, బీఎస్‌పీ పొత్తులో భాగంగా రెండు పార్టీలు చెరో 38 స్థానాల్లో పోటీ చేస్తాయని, రెండు సీట్లు చిన్న పార్టీలకు కేటాయిస్తామని చెప్పారు. కాంగ్రెస్‌తో పొత్తు లేకున్నా అమేథి, రాయబరేలీ వారికే విడిచిపెడుతున్నామని మాయావతి అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos