గాంధీనగర్: గుజరాత్లో సంక్రాంతి సందడి మొదలైంది. దీనిలో భాగంగా పతంగుల మార్కెట్లో ‘మోదీ వెర్సర్ రాహుల్’ కైట్స్ అత్యధికంగా విక్రయమవుతున్నాయి. ఎక్కడ చూసినా ఆకాశంలో మోదీ, రాహుల్ పతంగులు కనిపిస్తున్నాయి. రాజ్కోట్ మార్కెట్లో పతంగుల విక్రయాలు భారీ ఎత్తున కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మోదీ, రాహుల్ చిత్రాలతో రూపొందించిన పతంగులకు భారీ ఎత్తున డిమాండ్ నెలకొంది. మోదీ, రాహుల్ల పతంగుల ట్రెండ్ గత ఏడాదే మొదలైంది. ఈసారి ఈ పతంగులు మరింత ఆదరణ పొందుతున్నాయి. ఈసారి ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ పతంగులు మార్కెట్లోకి ప్రవేశించాయి. అలాగే ‘బాహుబలి’ పతంగులు చిన్నారులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఐరన్ మ్యాన్, ఛోటాభీమ్, స్పయిడర్ మ్యాన్ తదితర పతంగులు కూడా విరివిగా విక్రయమవుతున్నాయి.