అమరావతి: హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు, ఎంఐఎం అధినేత అసదుద్దీన్పై రాష్ట్ర మంత్రి ఎంఎండీ ఫరూక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం అమరావతిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సొంత సామ్రాజ్యంలో అసద్ తొడ కొట్టడం కాదని, నంద్యాలలో నాపై పోటీ చేయాలని సవాల్ విసరారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో ప్రచారం చేయడం కాదని, సికింద్రాబాద్లో అసదుద్దీన్ పోటీ చేసి గెలవాలన్నారు. అసద్ బీజేపీ ఏజెంట్ అని ఫరూక్ అన్నారు. దేశంలో మూడో ఫ్రంట్కు మనుగడలేదని, ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ముడుపుల కోసమే జగన్, కేటీఆర్ భేటీ అయ్యారని మంత్రి అన్నారు.