అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టింది ఎవరు..?

అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టింది ఎవరు..?

* దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పండిట్ నెహ్రూ కేబినెట్‌లో తొలి ఆర్దిక మంత్రిగా పనిచేసిన ఆర్కే షణ్ముఖం చెట్టి, 1947 నవంబర్ 26న తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.* ఇప్పటి వరకు అత్యధికంగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్ధిక మంత్రి మొరార్జీ దేశాయ్. ఆయన మొత్తం పది సార్లు ఈ ఘనత సాధించారు. మొరార్జీ దేశాయ్ తర్వాత పి. చిదంబరం 9 సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.* బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఏకైక మహిళా ఆర్ధిక మంత్రి ఇందిరాగాంధీ* 1998 వరకు బడ్జెట్‌ను ఫిబ్రవరి నెలలోని చివరి పనిదినంలో సాయంత్రం 5 గంటలకు ప్రవేశపెట్టారు. * 1999లో వాజ్‌పేయ్ హయాంలో బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో మార్పులు చేశారు. అప్పటి నుంచి బడ్జెట్‌ను ఫిబ్రవరి నెలలోని చివరి పనిదినంలో ఉదయం 11 గంటలకు ప్రవేశపెడుతూ వస్తున్నారు.* నరేంద్రమోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బడ్జెట్‌ను ఫిబ్రవరి ఒకటో తేదీని ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.* 2016 వరకు రైల్వే బడ్జెట్‌, కేంద్రబడ్జెట్‌‌ ను వేరుగా ప్రవేశపెట్టేవారు. అయితే 2017 నుంచి కేంద్రబడ్జెట్‌లో రైల్వే బడ్జెట్‌ను కలిపేశారు

.ప్రస్తుతం అందరూ బడ్జెట్ గురించే చర్చించుకుంటున్నారు. నేడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. బడ్జెట్ ని ప్రవేశపెట్టనుంది. ఈ ఏడాది సామాన్యుల కష్టాలు తీరనున్నాయా..? పెరగనున్నాయా..? అనేది కూడా ఈ బడ్జెట్ మీదే ఆధారపడి ఉంటుంది. ఇది కాసేపు పక్కన పెడితే.. బడ్జెట్ అనగానే దాదాపు అందరికీ గుర్తువచ్చేది.. ఆర్థికశాఖా మంత్రి చేతిలోని బడ్జెట్ సూట్ కేస్. బడ్జెట్ ప్రతులను ఆర్థిక శాఖ మంత్రి ఈ లెదర్ సూట్ కేసులో పెట్టుకొని పార్లమెంట్ లో అడుగుపెడతారు. అసలు ఈ బడ్జెట్ కి, లెదర్ సూట్ కేసుకి ఉన్న సంబంధం ఏమిటో మనం ఇప్పుడు చూద్దాం..బడ్జెట్ ను ఫ్రెంచ్ భాషలో బోగెటి అంటారు. ఇంగ్లీషులో దీని అర్థం లెదర్ బ్యాగ్. 1860లో బ్రిటన్ మొదటి ఆర్థిక మంత్రి విలియం ఎవర్ట్ గ్లాడ్ స్టోన్ మొదట లెదర్ బ్యాగ్ లో బడ్జెట్ పత్రాలు తీసుకొచ్చి బడ్జెట్ ప్రవేశపెట్టారు. అలా ఆయనతో మొదలైన సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది.బ్రిటీష్ వారు ప్రారంభించిన ఈ సాంప్రదాయన్ని స్వాంత్రంత్యం తర్వాత కూడా మన వాళ్లు కొనసాగిస్తూ రావడం విశేషం. సాదారణ లెదర్ బ్యాగ్ గే కదా.. అని తీసిపారేయలేం.. ఎందుకంటే.. ఒక దేశ ఆర్థిక వ్యవస్థని నడిపిచే శక్తి ఆ బ్యాగ్ లో ఉంది. అందుకే.. దానిని ఆర్థిక శాఖ మంత్రి జాగ్రత్తగా తీసుకువస్తుంటారు.బడ్డెట్ ని బ్రీఫ్ కేస్ లో తెచ్చే సాంప్రదాయం మారకపోయినా బ్రీఫ్ కేస్ రంగులు మాత్రం మారాయి. 1998-99 బడ్జెట్ సమయంలో ఫైనాన్స్ మినిస్టర్ యశ్వంత్ సిన్హా నలుపు రంగుల్లో లెదర్ బ్యాగ్‌లు తీసుకొచ్చారు. అదే సంప్రదాయాన్ని ఎంతో కీలకమైన ఆర్థిక సంస్కరణల సమయమైన 1991వ సంవత్సరంతో మన్మోహన్ సింగ్ సైతం కొనసాగించారు.అయితే యూపీఏ హయంలో అప్పటి ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ మాత్రం బ్రిటీష్‌ వారిలా బ్లాక్ రంగు బ్యాగ్ కు బదులు రెడ్ కలర్ బాక్స్ లో బడ్జెట్ పత్రాలు తీసుకొచ్చారు.తర్వాత ప్రతి ఏటా ఆర్థికమంత్రి బడ్జెట్ పేపర్లు తీసుకొచ్చే ఈ బ్యాగ్ రంగుల్లోనూ, రూపురేఖల్లోనూ తేడా కనిపిస్తూ వస్తోంది.ఆర్థికమంత్రిగా అరుణ్ జైట్లీ బాధ్యతలు స్వీకరించినప్పుడు మొదటి రెండు సంవత్సరాలు బ్లాక్, ట్యాన్ రంగుల్లో బ్యాగ్ ను వాడారు. బడ్జెట్ బాక్స్ ను మాత్రం ఆర్థికమంత్రిత్వ శాఖే సేకరిస్తోంది. నాలుగు రంగుల్లో బ్యాగులను ఆర్థికమంత్రి ముందు ఉంచుతుంది. వాటిలో తనకు నచ్చిన రంగును ఆర్థికమంత్రి ఎంచుకుంటారు. ఈ సంవత్సరం పీయూష్ గోయల్ మెరున్ రంగు సూట్ కేసుతో పార్లెమంట్ లోకి అడుగుపెట్టారు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos