అట్లాంటా (అమెరికా): క్రిస్మస్ వేడుకలను అమెరికాలో అట్లాంటా తెలుగు సంఘం ఆధ్వర్యంలో అట్లాంటా తెలుగు చర్చి ఘనంగా నిర్వహించింది. జార్జియాలోని పీచ్ట్రీ కార్నర్ నగరంలో క్రిస్ట్ ద కింగ్ లూథరన్ చర్చి ఇందుకు వేదికైంది. తెలుగు రాష్ట్రాలకు చెంది అట్లాంటాలో స్థిరపడ్డ వారు.. ఈ వేడుకల్లో చురుగ్గా పాల్గొన్నారు. నిర్వాహకులు చేసిన క్రీస్తు ప్రవచనాలను తెలుగువారు ఆసక్తిగా విన్నారు. యువతీయువకులు భక్తి కీర్తనలు పాడారు. బాలబాలికలు భక్తి పాటలపై చేసిన నృత్యాలు అలరించాయి. మరికొంత మంది యువతీయువకులు క్రీస్తు జీవనంపై వేసిన నాటక ప్రదర్శనలు అలరించాయి. వేడుకలకు హాజరైన వారంతా తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ జరుపుకుంటున్న వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ శుభ సమయంలో దేవుని కృప అందరిపై ఉండాలని నిర్వహకులు పాస్టర్ జాన్ బిల్లా, సుధ ఆకాంక్షించారు. కొన్నేళ్లుగా మెట్రో అట్లాంటాలో క్రిస్మస్ సందర్భంగా పాస్టర్ జాన్ బిల్లా, సుధ.. తెలుగువారందరితో క్రిస్మస్ వేడుకలను