కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అనుమానితుడు శ్రీనివాసులు రెడ్డి సోమవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన విషయాన్ని తెలుసుకున్న వెంటనే పోలీసులు అతణ్ని కడపలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కోసం తరలిం చారు. చికిత్స పొందుతూ శ్రీనివాసులు రెడ్డి మృతి చెందారు. పులివెందుల సీఐ శ్రీరాములు తన కుటుంబాన్ని, తనను అనవసరంగా వేదిస్తున్నం దునే ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుడు బలవన్మరణానికి ముందు ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్కు, వైఎస్ భాస్కర్ రెడ్డిలకు లేఖ రాసినట్టుగా సమాచారం. గత మార్చి 14ప వివేకానందరెడ్డి తన ఇంట్లోనే హత్యకు గురయ్యారు.