దేవుడి ప్రతిమను కూడా వదలరా?

దేవుడి ప్రతిమను కూడా వదలరా?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక వైసీపీ తీరు శృతి మించుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందుకు తగ్గట్లే ఆ పార్టీ నేతలు,ఎమ్మెల్యేలు చివరకు మంత్రులు సైతం నోటి దురుసు వ్యాఖ్యలు చేస్తూ వైఎస్‌ జగన్‌ భజన చేస్తూ,పార్టీపై హద్దులు దాటే భక్తిని ప్రదర్శిస్తూ విమర్శలు మూటగట్టుకుంటున్నారు.ఈ తరుణంలో సాయిబాబా గుడిలో సాయిబాబా విగ్రహానికి వైసీపీ పార్టీ రంగులున్న దుస్తులు కప్పిన  ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.మంత్రి బొత్స సత్యరానాయణ ప్రాతినిథ్యం వహిస్తున్న విజయనగరం చీపురుపల్లి మండంలం రుంకానవీధిలో శ్రీ దత్త సాయిమందిరంలో సాయిబాబాకి వైసీపీ రంగు చీర కప్పడం చర్చనీయాంశంగా మారింది. దాంతో ఒక్కసారిగా భక్తులు అవాక్కయ్యారు. దేవుడిని సైతం వదల్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగుల పిచ్చి పరాకాష్టకు చేరిందని ఆరోపించారు. ఇప్పటి వరకు పశువులు, ప్రభుత్వ పాఠశాలలు, స్మశాన వాటికలు, మహాత్మగాంధీ విగ్రహాలకు మాత్రమే రంగులు వేసిన వైసీపీ చివరికి దేవుడిని కూడా వదల్లేదంటూ మండిపడుతున్నారు.

తాజా సమాచారం