రాజశేఖర రెడ్డి పార్టీ ఫిరాయించ లేదా?

రాజశేఖర రెడ్డి పార్టీ ఫిరాయించ లేదా?

అమరావతి: గత ప్రభుత్వం మాదిరి తాను ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తే తెదేపాలో ఎవరూ మిగలరని శాసనసభలో ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలపై చంద్ర బాబు నాయుడు మండి పడ్డారు. ‘1975లో నేను, రాజశేఖర రెడ్డి ఇద్దరం ఒకేసారి శాస నసభకు ఎన్నికయ్యాం. రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచిన రాజశేఖరరెడ్డి నాలుగు రోజులకే కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పుడు మీ తండ్రి చేసింది కూడా తప్పేనని ఒప్పుకోవాల’ని ముఖ్యమంత్రి జగన్కు సవాలు విసిరారు. చరిత్రను ఎవరూ మార్చలేరంటూ తొలి ప్రసంగంలోనే ప్రతిపక్షాన్ని అడుగడుగునా కించ పరిచే విధంగా జగన్ మాట్లాడుతున్నారని ఆక్రోశించారు. అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా వాటిని ప్రజలు ఇచ్చారనేదాన్ని అందరూ గుర్తుంచు కోవాలని అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos