అమరావతి:ఎన్టీఆర్ భరోసా పథకం పేరును వైకాపా ప్రభుత్వం శుక్రవారం వైఎస్సార్ ఫించను కానుక’గా మార్చింది. జగన్ గురువారం ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వెంటనే నవరత్నాల హామీ అమలు చర్యల్ని ప్రారంభించారు. వృద్దుల ఫించన్ను రూ.2,250కి పెంచారు. వికలాంగులకు రూ.3 వేలు, మూత్ర పిండాల వ్యాధులబాధితులకు రూ.10 వేలు వంతున ఫించను ఇవ్వనున్నారు. ఫించను పొందే వృద్ధుల వయస్సును 65 ఏళ్ల నుం60 ఏళ్లకు తగ్గించారు. కొత్త ఫించను న్ పథకం జూన్ 1 నుంచి అమలు కానుంది.