అమరావతి: దేశంలో అత్యధిక ప్రజాదరణ ఉన్న ముఖ్యమంత్రుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ నాలుగో స్థానంలో నిలిచారని వైకాపా తెలిపింది. తాజాగా సీ-ఓటర్ చేసిన సర్వేలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అగ్ర స్థానంలో ఉన్నారు. రెండు, మూడు స్థానాల్లో ఛత్తీస్గఢ్ మఖ్యమంత్రి భూపేష్ బఘేల్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఉన్నారు. ఐదు, ఆరు, ఏడో స్థానాల్లో మహారాష్ట్ర, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు నిలిచారని వైకాపా ట్విట్టర్ లో పేర్కొంది.