రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

హొసూరు : హొసూరు-కెలమంగలం రోడ్డు అగ్గొండపల్లి వద్ద టెంపో ఢీ కొని ద్విచక్ర వాహనంపై వెళుతున్న యువకుడు మరణించాడు. హొసూరు వద్ద ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్న ఆ  యువకుడు మంగళవారం ఉదయం తన ద్విచక్ర వాహనంపై కెలమంగలం నుంచి హొసూరు వైపు వస్తుండగా టెంపో అదుపు తప్పి అతని వాహనాన్ని ఢీకొంది. తీవ్రంగా గాయపడి అతను అక్కడికక్కడే మరణించాడు. ఈ సంఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శవాన్ని హొసూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. యువకుని ద్విచక్ర వాహనం నంబరు ఆధారంగా విచారణ జరుపుతున్నారు. ఈ ప్రమాదం అగ్గొండపల్లి వాసుల హృదయాలను కలచివేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos