క్రికెటర్ మహింద్ర సింగ్ ధోనీ కుమార్తె జీవానుద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన నిందితుణ్ని పోలీసులు అరెస్టు చేశారు. గుజరాత్లోని కుచ్ జిల్లాలో 16 ఏళ్ల యువకుడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు. ఐపిఎల్లో కెకెఆర్, సిఎస్కె క్రికెట్ మ్యాచ్ ముగిసిన అనంతరం..ఈ యువకుడు ధోని భార్య సాక్షి ఇన్స్టాగ్రామ్ ఖాతాలో వారి కుమార్తె జీవాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ యువకుడు 12వ తరగతి చదువుతున్నాడని, తానే ఆ పోస్టు చేసినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. రాంచీ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు ..విచారణ చేపట్టినట్లు తెలిపారు. ఈ పోస్ట్ చేసింది అతడే అని నిర్ధారించుకున్నామని, ఎఫ్ఐఆర్ రాంచీలో నమోదైనందున అక్కడి పోలీసులకు అప్పగించనున్నట్లు తెలిపారు.