యువతిని బలిగొన్న బ్యానర్..

  • In Crime
  • September 13, 2019
  • 137 Views
యువతిని బలిగొన్న బ్యానర్..

రాజకీయ పార్టీ మాజీ కౌన్సిలర్‌ రోడ్డుపై ఏర్పాటు చేసిన బ్యానర్ ఓ విద్యార్థి మరణానికి కారణమైంది.చెన్నై నగరంలో చోటు చేసుకున్న ఈ దుర్ఘటనపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.పల్లావరం రెడియల్ రోడ్డులో పళ్లికరణై వద్ద శుభశ్రీ (23)అనే యువతి స్కూటర్ మీద వెళుతోంది.ఈ ప్రాంతంలో అధికార ఏఐఏడీఎంకే పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్ ఏర్పాటు చేసిన వివాహ ఆహ్వాన బ్యానర్ ఒక్కసారిగడా కూలిపోయి శుభశ్రీపై పడింది.దీంతో బైకు అదుపు తప్పడంతో బైకుతో సహా శుభశ్రీ రోడ్డుపై పడిపోయింది.అదే సమయంలో వెనుకవైపు నుంచి వస్తున్న లారీ శుభశ్రీ పైనుంచి దూసుకెళ్లడంతో అక్కడిక్కడే మృతి చెందింది. బ్యానర్ను ఎలాంటి అనుమతి అన్నది పొందకుండా ఏర్పాటు చేసి ఉన్నట్టు విచారణలో తేలింది. ఈ బ్యానర్ రూపంలో శుభశ్రీ మరణించడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పదేపదే ఈ మార్గంలో ఇష్టానుసారంగా రాజకీయ పార్టీల నాయకుల బ్యానర్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. వీటి కారణంగా ప్రమాదాలు పెరుగుతున్నాయన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యువతి మృతి విషయం తెలిసిన విపక్షాలు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. హోర్డింగ్ పెట్టుకోవడానికి అనుమతి కూడా తీసుకోలేదని ధ్వజమెత్తాయి. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే సుభశ్రీ ప్రాణాలు కోల్పోయిందని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ఆరోపించారు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos